- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి: RSP
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. దీనిపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కార్, వైద్యారోగ్యశాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఇబ్రహీంపట్నం దవాఖానాలో కుటుంబ నియంత్ర ఆపరేషన్లలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ దుష్టపాలనకు పరాకాష్ట. ప్రజల ప్రాణాలు కాపాడలేని ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలి. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి.'' అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
ఇబ్రహీంపట్నం దవాఖానాలో కుటుంబ నియంత్ర ఆపరేషన్లలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం #KCR @trspartyonline దుష్టపాలనకు పరాకాష్ట. ప్రజల ప్రాణాలు కాపాడలేని ఆరోగ్యశాఖా మంత్రి @trsharish ను బర్తరఫ్ చేయాలి. #Telangana లో రాష్ట్రపతి పాలన విధించాలి. https://t.co/uPJbfEPbJX
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 30, 2022